న్యూఢిల్లీ, ఆగస్టు 3: జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల సౌకర్యార్థం ఓ యాప్ను తీసుకొచ్చినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉన్న రాజ్మార్గ్ యాత్ర యాప్లో జాతీయ రహదారులకు సంబంధించిన సమాచారంతో పాటు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపింది.
రహదారులపై ఉన్న టోల్ప్లాజాలు, హోటళ్లు, పెట్రోల్ బంకులు, దవాఖానల సమాచారం ఉంటుందని పేర్కొంది. ఫొటోలు, వీడియోలు జత చేసి జియో ట్యాగ్ చేయవచ్చని తెలిపింది. ఇందులో ఫాస్ట్ట్యాగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.