న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు రాజ్కుమార్ రావును భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్గా నియమించింది. ఎన్నికలలో ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరిచేందుకు ఈసీ దేశంలోని ప్రముఖులను నేషనల్ ఐకాన్లుగా నియమిస్తుంది. అందులో భాగంగా ‘న్యూటన్’ అనే హిందీ చిత్రంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్లో స్వేచ్ఛ, పారదర్శకతతోఎన్నికలు నిర్వహించే ప్రభుత్వ అధికారి పాత్రను పోషించిన రాజ్కుమార్ రావును ఈసీ నేషనల్ ఐకాన్గా ఎంపిక చేసినట్టు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గురువారం ప్రకటించారు.