న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏజీ పెరారివాలన్ తన ముందస్తు రిలీజ్పై దరఖాస్తు చేసుకున్న విచారణ పిటిషన్ను సుప్రీంకోర్టు జనవరికి వాయిదా వేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఇప్పటికే పెరారివాలన్కు మూడు దశాబ్ధాల నుంచి జైలుశిక్షను అనుభవిస్తున్నాడు.అయితే పెరారీవాలన్ రిలీజ్పై తమిళనాడు గవర్నర్ ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆయన ఈ కేసును రాష్ట్రపతికి సిఫారసు చేశారు. నిజానికి పెరారివాలన్ను రిలీజ్ చేయాలని 2018, సెప్టెంబర్ 9వ తేదీన తమిళనాడు మంత్రిమండలి ప్రతిపాదించింది. రాజకీయ కారణాలతోనే తనను జైలు నుంచి రిలీజ్ చేయడం లేదని పెరారివాలన్ ఆరోపించారు. రిలీజ్పై ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరలేమని సుప్రీంకోర్టు ఇవాళ తెలిపింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. మరో కోర్టులో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కేసును వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దీంతో పెరారివాలన్ రిలీజ్ కేసు వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడింది.