ముంబై: ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఉన్న కర్బుడే సొరంగంలో పట్టాలు తప్పింది. అయితే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. రైళ్లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ముంబైకి 325 కిలోమీటర్ల దూరంలో ప్రమాద స్థలం ఉన్నట్లు చెప్పారు.