జైపూర్: ఉత్తరాది రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో జనం చలికి గజగజ వణుకుతున్నారు. రాజస్థాన్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నది. గత రెండుమూడు రోజులుగా అక్కడ ఎడతెరపి లేకుండా మంచు కురుస్తున్నది.
దాంతో ఇండ్ల మీద, చెట్ల మీద, వాహనాల మీద, రోడ్ల మీద మంచు పేరుకుపోయింది. వాహనాల మీద అయితే కనీసం రెండు మూడు ఇంచుల మందంతో మంచు పొరలు కప్పింది. చురు పట్టణంలో అయితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవాళ జీరో డిగ్రీ సెల్సియస్కు పడిపోయాయి.
#WATCH | Rajasthan: A sheet of ice forms on vehicles & plants as the lowest minimum temperature plummeted to zero degree celsius in Churu today. #ColdWave pic.twitter.com/OVenwctgsD
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 26, 2022