జైపూర్: కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు రాజస్థాన్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పథకాన్ని శనివారం ప్రకటించింది. ముఖ్యమంత్రి కరోనా బాల్ కళ్యాణ్ యోజనను వెల్లడించింది. దీని కింద బాధిత పిల్లలకు తొలుత ఏక మొత్తంగా రూ. లక్షతోపాటు 18 ఏండ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ.2,500 చెల్లిస్తారు. అలాగే 18 ఏండ్లు నిండిన తర్వాత వారు తమ కాళ్లపై నిలబడేందుకు రూ .5 లక్షలు కూడా ఇస్తామని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ పథకానికి సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది.