జైపూర్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.63 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్, నార్కొటిక్స్, ఆదాయపు పన్ను శాఖల అధికారులు నిర్వహించిన దాడుల్లో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు చీఫ్ ఎలక్టొరల్ ఆఫీసర్ ప్రవీణ్ గుప్తా చెప్పారు. నవంబరు 25న రాజస్థాన్లో పోలింగ్ జరుగనుంది.