రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్ ఘోగ్రా కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈయన సీఎం గెహ్లోత్కు అత్యంత సన్నిహితుడు. రాజస్థాన్లోని డంగార్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాను ఎమ్మెల్యే అయినప్పటికీ.. తనను పార్టీలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
అటు అధికార యంత్రాంగం కూడా తనను లెక్క చేయడం లేదని, ప్రజా సమస్యలు చెబితే, పరిష్కరించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్కు, సీఎం గెహ్లాత్కు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.