న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి రెండేళ్ల జైలు శిక్ష పడ్డ తరుణంలో.. ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఓ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కొత్త ఇండియా ఇలా ఉందన్నారు. విపక్ష నేతలే బీజేపీ టార్గెట్ అయినట్లు ఆమె విమర్శించారు. నేర చరిత్ర ఉన్న బీజేపీ నేతలను క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని, ఇక విపక్ష నేతలపై అనర్హత వేటు వేస్తున్నారని ఆమె అన్నారు. రాజ్యాంగబద్దమైన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మరింత దిగజారినట్లు ఆమె ఆరోపించారు.
In PM Modi’s New India, Opposition leaders have become the prime target of BJP!
While BJP leaders with criminal antecedents are inducted into the cabinet, Opposition leaders are disqualified for their speeches.
Today, we have witnessed a new low for our constitutional democracy
— Mamata Banerjee (@MamataOfficial) March 24, 2023
గతంలోనూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఇలాగే వేధించినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్(CM Ashok Gehlot) తెలిపారు. ఆమెను కూడా పార్లమెంట్ నుంచి బహిష్కరించినట్లు ఆయన గుర్తు చేశారు. దానికి ప్రతిఫలాన్ని అనుభవించారన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఇందిరా గాంధీ హవా కొనసాగిందని, భారీ మెజారిటీతో ఆమె ప్రధాని అయినట్లు గెహ్లాత్ తెలిపారు. తాజాగా జరుగుతున్న పరిణామాలు 2024 ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారనున్నట్లు సీఎం గెహ్లాత్ చెప్పారు.
मेरा मानना है कि राहुल जी की सदस्यता रद्द करने जैसी कार्रवाई के लिए जनता भाजपा सरकार को बख्शेगी नहीं। pic.twitter.com/hGpJCBub98
— Ashok Gehlot (@ashokgehlot51) March 24, 2023