Minister Babulal | జైపూర్, జనవరి 10: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాజస్థాన్ బీజేపీ మంత్రి బాబూలాల్ ఖరాడీ ప్రజలకు పిలుపునిచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారికోసం ప్రధాని మోదీ ఇళ్లు కట్టిచ్చి ఇస్తారని చెప్పారు. ‘ప్రజలెవ్వరూ ఆకలితో, ఇల్లు లేకుండా ఉండరాదని ప్రధాని కోరుకుంటున్నారు.
మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి. ప్రధాని వారికి ఇళ్లు కట్టించి ఇస్తారు. ఇంక మీకు సమస్యేం ఉంటుంది?’ అని ఉదయ్పూర్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలకు సభికులు పడిపడి నవ్వగా, వేదికపై ఆసీనులైన ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ, ఇతర నేతలు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.