న్యూఢిల్లీ: నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా(Raj Kundra) ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. సుమారు వంద కోట్ల వరకు సీజ్ చేశారు. బిట్కాయిన్ ఫ్రాడ్ కేసులో ఆ ఆస్తుల్ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. రాజ్కుంద్రా సంస్థ 2017లో బిట్కాయిన్ల రూపంలో సుమారు 6600 కోట్లు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు పది శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు కేసు ఫైల్ చేశారు. ఈ స్కీమ్లో మాస్టర్మైండ్ అయిన అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్కుంద్రా సుమారు 285 బిట్కాయిన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బిట్కాయిన్లతో ఉక్రెయిన్లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడీ అటాచ్ చేసిన ప్రాపర్టీల్లో జూహూలో బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ నటి శిల్పా శెట్టి పేరుమీద ఉన్నది. పుణెలో కూడా మరో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉన్నది. దాన్ని కూడా సీజ్ చేశారు.