న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. వానకు ఈదురు గాలులు తోడవడంతో అక్కడక్కడ రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. వర్షం కురవడంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఈ నేపథ్యంలో ఎండవేడితో బాధపడుతున్న ఢిల్లీ వాసులకు ఉపషమనం లభించినట్లయింది.
కాగా, ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రానున్న ఆరు రోజుల్లో మోస్తరు నుంచి సాధరణ వర్షం నమోదవుతుందని, ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఈనేపథ్యంలో పసుపు హెచ్చరికను జారీచేసింది.
#WATCH | Delhi: Rain lashes parts of the national capital
(Visuals from Connaught Place) pic.twitter.com/9uShCX3Lbq
— ANI (@ANI) June 15, 2022
#WATCH | Uttar Pradesh: Rain lashes parts of Noida pic.twitter.com/GK5NHQ5UXQ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 15, 2022