న్యూఢిల్లీ : ఒడిశాలోని బాలాసోర్ (Odisha Train Accident) రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు సీబీఐ విచారణను సిఫార్సు చేసిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఇక దుర్ఘటన అనంతరం బాలాసోర్లోని రెండు రైల్వే లైన్లు ఆదివారం రాత్రి 8 గంటలకు పునరుద్ధరించనున్నట్టు రైల్వే బోర్డు తెలిపిందని మంత్రి వెల్లడించారు.
మూడు రైలు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు వేగంగా సాగుతున్నాయని వరుస ట్వీట్లలో మంత్రి పేర్కొన్నారు. బాలాసోర్లోని ప్రమాద స్ధలం వద్ద ఓవర్హెడ్ ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా, ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.
270 మందికి పైగా ప్రాణాలు విడిచినా ప్రభుత్వం జవాబుదారీతనం కొరవడిందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బాధాకర ఘటనకు బాధ్యత తీసుకోవడం నుంచి మోదీ ప్రభుత్వం పారిపోలేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు రైల్వే మంత్రిని బాధ్యుడిని చేస్తూ ప్రధాని మోదీ తక్షణమే మంత్రి రాజీనామాను కోరాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Read More