చండీగఢ్/హోషియార్పూర్, సెప్టెంబర్ 29: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన రైల్ రోకో కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం పంజాబ్లోని పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై నిరసనను కొనసాగించారు. అలాగే పంజాబ్లోని చండీగఢ్-అంబాలా-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్బంధించారు.
వరదల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల రైల్ రోకో కార్యక్రమానికి అన్నదాతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పంజాబ్లోని దాదాపు 17 ప్రాంతాల్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. రైలు అధికారులు ఎంత చెప్పినా అన్నదాతలు వినకపోవడంతో పలు రైళ్లను రద్దు చేశారు. జాతీయ రహదారి వద్ద ట్రాక్టర్లను పార్కింగ్ చేయడం, రోడ్డును దిగ్బంధించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.