న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చైర్పర్సన్గా రాహుల్ సింగ్ను కేంద్రం నియమించింది. ఆయన 1996 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుత సీబీఎస్ఈ చీఫ్ నిధి చిబ్బెర్ నీతి ఆయోగ్ సలహాదారుగా నియమితులయ్యారు. రాహుల్ ప్రస్తుతం డీఓపీటీ అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. రాహుల్ స్థానంలో ఏపీ దాస్ జోషీని డీఓపీటీ అదనపు కార్యదర్శిగా కేంద్రం నియమించింది.