శ్రీనగర్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పోలిన వ్యక్తి ఆయన చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. టీ షర్టు ధరించిన అతడు, అచ్చం రాహుల్ మాదిరిగా పోలిక ఉండటంతోపాటు ఆయన మాదిరిగా హావభావాలను ప్రదర్శించాడు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ జమ్ముకశ్మీర్కు చేరింది. సోమవారం జమ్ములోకి ప్రవేశించిన ఈ యాత్రలో రాహుల్ గాంధీని పోలిన ఫైజల్ చౌదరి అనే వ్యక్తి పాల్గొన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నడిచాడు. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లాలోని సంగత్ గ్రామానికి చెందిన ఆయన రాహుల్ గాంధీని పోలి ఉండటంతో సెల్ఫీలు తీసుకునేందుకు చాలా మంది పోటీపడ్డారు.
కాగా, రాహుల్ గాంధీ మాదిరిగా తాను కనిపించడం అదృష్టంగా భావిస్తున్నానని ఫైజల్ చౌదరి మీడియాతో అన్నాడు. రాహుల్ కంటే సగం వయసు, 24 ఏళ్లు ఉన్న తాను కాంగ్రెస్ కార్యకర్తనని తెలిపాడు. విద్వేషపు గోడలను కూల్చి, ప్రేమ, సామరస్యంతో కూడిన కొత్త వాతావరణాన్ని రాహుల్ గాంధీ తీసుకొస్తారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ యాత్ర వంద శాతం సక్సెస్ అవుతుందని, దేశానికి కొత్త వెలుగు తెస్తుందని ఆకాంక్షించాడు. రాహుల్ గాంధీతో ఫొటోలు తీయించుకోలేని వారు తనతో ఫొటోలు దిగుతున్నారని వెల్లడించాడు.
మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కూడా ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఫైజల్ చౌదరి ఎట్టకేలకు సోమవారం ఉదయం జమ్ములో ఈ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీని స్వయంగా కలిశాడు. ఈ నెల 30న శ్రీనగర్లో ‘భారత్ జోడో యాత్ర’ ముగియనున్నది. యాత్ర ముగింపు కార్యక్రమానికి 21 ప్రతిపక్ష పార్టీలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది.
Watch: Rahul Gandhi's lookalike at Bharat Jodo Yatra in Jammu and Kashmir pic.twitter.com/u1IVLx0pwF
— NDTV (@ndtv) January 23, 2023
#BharatJodoYatra started in Kathua, Rahul Gandhi's lookalike also participated. @bharatjodo@INCJammuKashmir#BharatJodoYatraInJK #RahulGandhi #congress #RahulGandhi #Jammu pic.twitter.com/abr2jG8McG
— News18 Kashmir (@News18Kashmir) January 22, 2023