న్యూఢిల్లీ : రెండుసార్లు వరల్డ్ చాంపియన్షిప్ మెడల్స్ గెలుచుకున్న రెజ్లర్ వినేష్ ఫొగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డ్స్ను తిరిగి ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికకు నిరసనగా వినేష్ ఫొగట్ అవార్డులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ దేశ బిడ్డలకు ఆత్మ గౌరవం ముఖ్యమని, ఆ తర్వాతే ఏ మెడల్స్ అయినా గౌరవమైనా అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ధీర వనితల కన్నీళ్ల కంటే ప్రకటిత బాహుబలి నుంచి పొందిన రాజకీయ లబ్ధి అధికమా అని రాహుల్ ప్రశ్నించారు.
ప్రధాని దేశానికి సంరక్షకుడని, ఆయన నుంచి ఇలాంటి అమానవీయతను చూడటం బాధాకరమని రాహుల్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. కాగా సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం పట్ల పలువురు రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ మెడల్స్ను వెనక్కి ఇచ్చేస్తున్న సంగతి తెలిసిందే.
Read More :
Mukesh Ambani | 2023లో ముకేశ్ అంబానీ సంపద అంత పెరిగిందా ? మరి గౌతమ్ అదానీ పరిస్థితి ?