Rahul Gandhi | న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi ) పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాహుల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కానీ మీడియాతో మాట్లాడలేదు. అయితే అనర్హత వేటు( Disqualified )పై రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా( Media )తో మాట్లాడనున్నారు. అనర్హత వేటు దృష్ట్యా రాహుల్ ఏం మాట్లాడుతారో అని అటు కాంగ్రెస్ శ్రేణుల్లో( Congress Leaders ), ఇటు దేశ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
ప్రధాని మోదీ( PM Modi )ని ఇంటిపేరుతో దూషించిన కేసులో సూరత్ కోర్టు( Surat Court ) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధించిన క్రమంలో ఆయనపై అనర్హత వేటు పడింది. దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశం కోసం గొంతువిప్పేందుకు తాను పోరాడతానని, ఈ క్రమంలో ఎలాంటి మూల్యం చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ ట్వీట్ చేశారు.
मैं भारत की आवाज़ के लिए लड़ रहा हूं।
मैं हर कीमत चुकाने को तैयार हूं।
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2023