చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్పై రాసిన ఆటోబయోగ్రఫీ ఉంగలిల్ ఒరువన్ పుస్తకం తొలి భాగాన్ని ఈనెల 28వ తేదీన రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు. తమిళనాడు సీఎంవో కార్యాలయం ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపింది. స్వీయచరిత్ర పుస్తకావిష్కరణకు కేరళ సీఎం విజయన్, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీహార్ విపక్ష నేత తేజస్వీ యాదవ్లు హాజరుకానున్నారు. తమిళ నటుడు సత్యరాజ్ ఈ పుస్తకాన్ని పరిచయం చేయనున్నారు. స్కూల్ పిల్లవాడిగా ఎలా రాజకీయ ప్రవేశం చేశారన్న విషయాన్ని ఈ పుస్తకంలో స్టాలిన్ చెప్పినట్లు తెలుస్తోంది. పెరియార్, అన్నాదురై, తండ్రి కరుణానిధి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకున్నట్లు ఆ బుక్లో తెలిపారు. ద్రవిడ ఉద్యమ సమయంలో జరిగిన పోరాటం గురించి కూడా స్టాలిన్ ఆ బుక్లో వెల్లడించారు.