పట్నా : 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీని దీటుగా నిలువరించేందుకు బిహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో శుక్రవారం జరగనున్న విపక్ష భేటీకి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటక అ
సెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ఘోర పరాభవం ఎదురైందో మీరు చూశారని రాహుల్ పేర్కొన్నారు. తాము పేదల పక్షాన నిలిచినందునే విజయం వరించిందని అన్నారు.
కాంగ్రెస్ సామాన్యుడి వెన్నంట నిలిస్తే బీజేపీ మాత్రం కేవలం ఇద్దరు ముగ్గురు అత్యంత సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తోందని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్దాన్, చత్తీస్ఘఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, బీజేపీ తమ దరిదాపుల్లోకి రాదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.
ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు బిహార్ సీఎం నితీష్ కుమార్ నివాసంలో విపక్ష నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, శివసేన నేతలు (యూబీటీ) ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ సహా పలువురు విపక్ష నేతలు హాజరయ్యారు. విపక్షాల సమావేశంలో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, జేఎంఎం, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీ నేతలు పాల్గొంటున్నారు.
Read More :