Rahul Gandhi : తాను చేసిన శక్తి వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శక్తి వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రధాని మోదీ తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారని అన్నారు. తాను వాస్తవాలు మాట్లాడాననే విషయం ప్రధానికి తెలుసునని రాహుల్ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ వక్రీకరించారని రాహుల్ ఆరోపించారు. అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధాని మోదీ(PM Modi) కౌంటర్ ఇచ్చారు.
ఎవరైనా శక్తి వినాశనాన్ని కోరుతారా అని ఆయన ప్రశ్నించారు. జగిత్యాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత నేలపై ఎవరైనా శక్తి వినాశనం గురించి మాట్లాడుతారా, మనం అందరం శక్తిని ఆరాధిస్తామా లేదా అని ఆయన అడిగారు. యావత్ భారత దేశం శక్తిమాతను ఆరాధిస్తుందన్నారు. చంద్రయాన్ విజయాన్ని కూడా శక్తిగా గుర్తించామని, ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అని పేరు పెట్టినట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు.
ఇక భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం రాహుల్ మాట్లాడుతూ హిందూమతంలో శక్తి అన్న పదం ఉన్నదని, ఆ శక్తితో తాము పోరాడుతున్నామని, ఆ శక్తి ఏంటన్నదే ప్రశ్న అని, ఓ రాజు ఆత్మ ఈవీఎంలో ఉన్నదని, ఇది నిజం అని, ఈడీ, సీబీఐ, ఆదాయ పన్నుశాఖ లాంటి సంస్థలపైనే ఆ రాజు ఆత్మ ఉందని రాహుల్ విమర్శించారు.
Read More :
Tamilisai | తమిళిసై ఎక్కడ్నుంచి పోటీ..? తూత్తుకుడినా..! పుదుచ్చేరినా..!!