న్యూఢిల్లీ : మోదీ ఇంటి పేరు కలిగినవారంతా దొంగలేననే అర్ధం వచ్చేలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా ప్రధాని మోదీ (Pm Modi) ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు (Gujarat Surat Court) గురువారం కీలక తీర్పు వెలువరించింది.
ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది. అయితే తీర్పు వెలువడే ముందు కోర్టు ఎదుట హాజరైన రాహుల్ తన ఉద్దేశం సరైందేనని, దురుద్దేశంతో తాను మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.
దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన ప్రశ్నించారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లారు. రాహుల్పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో నేడు విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించిన వెంటనే ఆయన లీగల్ టీం బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు రాహుల్కు బెయిల్ మంజూరు చేసింది.
Read More :