న్యూఢిల్లీ: పీఎం కేర్స్ ఫండ్కు ప్రభుత్వ సంస్థల నుంచి రూ.వేల కోట్లు విరాళాలుగా వెళ్లాయని, అయితే సుమారు రూ.5 వేల కోట్లు ఉన్న ఈ నిధికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి లెక్కలు చెప్పడం లేదని, ప్రజలకు చెందిన ఈ సొమ్మంతా ఎక్కడికి పోతున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఈ మేరకు ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టారు. పీఎం కేర్స్ ఫండ్ పేరిట రూ.వేల కోట్లు ప్రజల నుంచి తీసుకున్నారని, అయితే దాని జమా ఖర్చులను మాత్రం ప్రభుత్వం తెలియజేయడం లేదని విమర్శించారు. ఈ మొత్తంలో ఒక్క పైసా కూడా ప్రజలకు ఖర్చు పెట్టలేదన్నారు.