న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, నానమ్మ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్లో ఉన్న ఆమె సమాధిపై పూలు చల్లి కొద్దిసేపు మౌనం పాటించారు. రాహుల్తోపాటు పలువురు నేతలు ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు.
ఇందిరాగాంధీ 1966 నుంచి 77 వరకు దేశ ప్రధానిగా పనిచేశారు. 1977లో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దీంతో అమె అప్రతిష్టను మూటగట్టుకున్నారు.
1980లో రెండోసారి ప్రధాని పదవిని చేపట్టారు. 1984, అక్టోబర్ 31న భద్రతా సిబ్బందిలోని ఇద్దరు సిక్కు సైనికులు ఆమెను కాల్చి చంపారు.