Rahul Gandhi | వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 2021 సంవత్సరం నాటికి దేశంలో అర్హులైన వారందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించిందని, నేటితో 2021 సంవత్సరం ముగుస్తోందని, ఆ హామీ ఏమైందని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. ‘2021 నాటికి అర్హులైనవారందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించింది. నేటితో 2021 సంవత్సరం ముగుస్తోంది. ఏమైంది ఆ హామీ? దేశంలో ఇంకా చాలా మందికి వ్యాక్సినేషన్ కాలేదు. ఈ హామీ కూడా గాలికి పోయినట్లేనా?’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా దెప్పిపొడిచారు.