న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోమవారం పది గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ అధికారులు మంగళవారం రెండో రోజూ విచారించారు. రాహుల్పై ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. కీలక సమాచారం రాబట్టేలా అధికారులు ప్రశ్నలు గుప్పించారు.
మరోవైపు రాహుల్, సోనియా గాంధీలకు ఈడీ సమన్లు జారీ చేయడంపై నిరసనకు దిగిన కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోగా వారిని ఈరోజు బదార్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిర్భందించిన కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను కలిసేందుకు పోలీస్ స్టేషన్కు బయలుదేరిన చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భఘేల్ను ఢిల్లీ పోలీసులు అడ్డగించారు.
రాజకీయ దురుద్దేశంతోనే రాహుల్, సోనియా గాంధీలపై బూటకపు కేసులు బనాయించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బదార్పూర్ పోలీస్ స్టేషన్లో నిర్భందించిన కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గగోయ్, దీపీందర్ సింగ్ హుదా, రంజీత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్గర్హిలను పరామర్శించేందుకు రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పోలీస్ స్టేషన్ను సందర్శించేందుకు బయలుదేరారు.