Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతుండగా, ఒక్కసారిగా కాసేపు ఆగిపోయారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ప్రధానిపై సెటైర్ వేశారు. మీరు చెప్పే అబద్ధాలను టెలిప్రాంప్టర్ కూడా భరించలేకపోయింది అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా మోదీపై సెటైర్ వేశారు.
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. వచ్చే పాతికేళ్లలో భారత్ సంక్షేమం, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేయాలన్న లక్ష్యాలను నిర్దేశించుకుందని పేర్కొన్నారు. ఇలా ప్రధాని మోదీ అనర్గళంగా మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆగిపోయారు. టెలిప్రాంప్టర్లో ఏర్పడ్డ సాంకేతిక సమస్య వల్లే మోదీ ప్రసంగం ఆగిపోయిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఎందుకు ప్రసంగం ఆగిపోయిందన్న విషయంలో అధికారికంగా ఇప్పటి వరకూ ఎలాంటి వివరణ కూడా రాలేదు.