భోపాల్: రాహుల్గాంధీ భారత్ జోడో యాత్రలో ఆదివారం ఒక విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం రాహుల్గాంధీ యాత్ర మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్లో ప్రవేశించింది. అయితే, రాహుల్ యాత్ర రాజస్థాన్లోకి ఎంటర్ కావడానికి కొన్ని క్షణాల ముందు ఈ ఇంటరెస్టింగ్ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా జిల్లాలో రాహుల్ యాత్ర సాగుతుండగా కొంతమంది బీజేపీ మద్దతుదారులు మోదీ.. మోదీ.. అంటూ ప్రధానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ స్పందించిన తీరు ఆసక్తికరంగా ఉంది. మోదీ అనుకూల నినాదాలు చేస్తున్న వారి వైపు చూస్తూ రాహుల్గాంధీ ఫ్లైయింగ్ కిస్లు పెట్టారు.
ఈ వీడియోను న్యూస్ ట్రాక్ మీడియా పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేశారు. దాంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్ల రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి…
Rahul Gandhi की भारत जोड़ो यात्रा में लगे मोदी-मोदी के नारे, फिर देखिए क्या किया राहुल गांधी ने…#BharatJodaYatra #RahulGandhi #Viral #NarendraModi pic.twitter.com/llos6bm79b
— Newstrack (@newstrackmedia) December 5, 2022