న్యూఢిల్లీ : రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలపై మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. రఫేల్ డీల్లో భారత దళారీకి విమాన తయారీ కంపెనీ మిలియన్ యూరోల ముడుపులు ముట్టచెప్పిందని ఫ్రెంచ్మీడియా వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యవహారంపై స్పందించారు.
ప్రతి ఒక్కరి పనులకు లెక్క ఉంటుందని, కర్మను ఎవరూ తప్పించుకోలేరని కాంగ్రెస్ నేత ట్వీట్ చేశారు. కాగా రఫేల్ ఒప్పందంలో కమిషన్ల వ్యవహారంపై రాహుల్ ఎప్పటి నుంచో చెబుతున్నారని, ఇప్పుడు ఆయన ఆరోపణలు నిజమని ఫ్రెంచ్ మీడియా కథనంతో వెల్లడైందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రఫేల్ డీల్లో ముడుపులపై ఆరోపణలు నిరాధారమైనవని బీజేపీ నేతలు తోసిపుచ్చారు.