న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ ( Rahul Gandhi ) మరోసారి అధికార బీజేపీపైన, ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్పైన నిప్పులు చెరిగారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలు పనికిరానివని, వాటితో పోల్చుకుంటే కాంగ్రెస్ సిద్ధాంతం చాలా భిన్నమైనదని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బుధవారం జరిగిన మహిళ కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఒక కాంగ్రెస్ కార్యకర్తగా తాను ఏ పార్టీ సిద్ధాంతంతోనైనా కాంప్రమైజ్ కాగలనుగానీ.. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలతో మాత్రం ఎప్పటికీ కాంప్రమైజ్ కాబోనని చెప్పారు.
అయితే, పార్టీలుగా ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నా.. మహాత్మాగాంధీ, కాంగ్రెస్ పార్టీ, నాథురామ్ గాడ్సే, వీర్ సావర్కర్ సిద్ధాంతాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటనేది మాత్రం మనందరికీ సమాధానం లేని పెద్ద ప్రశ్న అని రాహుల్గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ జీవితాంతం హిందువుగానే ఉన్నాడు, మరి హిందూ మతవాది అయిన గాడ్సే.. గాంధీజీని ఎందుకు చంపినట్టు అని రాహుల్గాంధీ ప్రశ్నించారు.