Raghav Chadha : చండీఘఢ్ మేయర్ ఎన్నికలు విపక్ష ఇండియా కూటమి, బీజేపీ మధ్య తొలిపోరుకు వేదిక కానున్నాయని ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మంగళవారం పేర్కొన్నారు. రానున్న ఛండీఘడ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీతో తొలిసారిగా విపక్ష ఇండియా కూటమి తలపడనుందని, బీజేపీ, విపక్ష కూటమి నేరుగా తలపడే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఎదురవనుందని చద్దా ధీమా వ్యక్తం చేశారు.
ఆప్, కాంగ్రెస్లు ఈ ఎన్నికల్లో తలపడనుండగా ఈ పోరు రానున్న లోక్సభ ఎన్నికలకు కర్టెన్ రైజర్ కానుందని అన్నారు. చండీఘఢ్ మేయర్ ఎన్నికలకు సంబందించి ప్రకటన వెలువడిన వెంటనే ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చలు జరిపారని, ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారని చద్దా వెల్లడించారు.
మేయర్ అభ్యర్ధి ఆప్ నుంచి ఎన్నికవుతారని, ఇద్దరు డిప్యూటీ మేయర్ అభ్యర్ధులు కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటారని చెప్పారు. ఆప్, కాంగ్రెస్ల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం ఆప్ అభ్యర్ధి కుల్లీప్ కుమార్ తిటా మేయర్ సీటుకు పోటీ పడుతుండగా, కాంగ్రెస్ అభ్యర్ధులు గురుప్రీత్ సింగ్ గబి, నిర్మలా దేవి సీనియర్ డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పోటీ చేస్తారు.
Read More :