అమరావతి : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC ) ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీకి చెందిన గిడుగు రుద్రరాజు(Gidugu rudraraju) ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈమేరకు గురువారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. 2022 నవంబర్ చివరి వారంలో ఏపీ పీసీసీగా నియామకమైన గిడుగు రుద్రరాజు సంవత్సరన్నరపాటు అధ్యక్షుడిగా సేవలందించారు.
అంతకు ముందు ఏఐసీసీ కార్యదర్శిగా ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహించిన ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవీపీలకు సన్నిహితుడిగా మెలిగారు. పార్టీ ఆదేశాల మేరకు సోమవారం ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన 24 గంటల్లోనే ఆ స్థానంలో వైఎస్ షర్మిలను పీసీసీ చీఫ్గా నియమించారు.