న్యూఢిల్లీ: పాకిస్థాన్ నుంచి చైనా వెళ్తున్న ఓ ప్రమాదకర కార్గోను గుజరాత్లోని అదానీ పోర్టులో సీజ్ చేశారు. డీఆర్ఐ అధికారులు ముంద్రా పోర్టులో ఓ విదేశీ రవాణా నౌకను సోదా చేశారు. దాంట్లో ప్రమాకరమైన, విషపూరితమైన కార్గో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ నౌకలో రేడియోధార్మిక కార్గో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పాకిస్థాన్లోని కరాచీ నుంచి చైనాలోని షాంఘైకు ఆ కంటేనర్లు వెళ్తున్నాయి. నాన్-హజార్డస్ అని ఆ కంటేనర్ల లిస్టింగ్లో ఉన్నా.. సీజ్ చేసిన కార్గోపై క్లాస్ 7 మార్కింగ్ ఉన్నట్లు తెలిపారు. ఆ మార్కింగ్ ఉంటే.. వాటిల్లో రేడియోధార్మిక వస్తువులు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. నవంబర్ 18వ తేదీన కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు ముంద్రా పోర్టులో పలు కంటేనర్లను సీజ్ చేసినట్లు అదానీ పోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.