మేడ్చల్ రూరల్, జూలై 8 : పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పది రోజులతోనే సరిపెట్టవద్దని, నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ శ్వేతా మహంతి సర్పంచులు, కార్యదర్శులకు సూచించారు. మేడ్చల్ మండల పరిధిలోని సోమారం, పూడూరు, లింగాపూర్ గ్రామాల్లో గురువారం కలెక్టర్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, నర్సరీ, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులను పరిశీలించారు. అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీపీఓ రమణమూర్తి, డీఆర్డీఓ పద్మజరాణి, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
శామీర్పేట : పల్లె ప్రగతిలో భాగంగా మూడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామంలో కలెక్టర్ శ్వేతామహంతి పర్యటించారు. గ్రామంలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాలు, పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్, డీపీఓ, సర్పంచ్ శిల్పాయాదగిరి, వైస్ ఎంపీపీ , ఎంపీడీఓ పాల్గొన్నారు.