హైదరాబాద్, ఫిబ్రవరి 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఆయన ఔన్నత్యానికి తగిన రీతిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పీవీలోని భిన్న కోణాలను ఆవిష్కరిస్తూ ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా 28.06.2020 నుంచి 28.06.2021 వరకు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వందలాది కథనాలతో అక్షర నివాళి అర్పించింది. అనంతరం ‘నమస్తే పీవీ’ పేరిట పుస్తకాన్నీ అందుబాటులోకి తీసుకొచ్చింది.