డెహ్రాడూన్: పుష్కర్ సింగ్ ధామి మరోసారి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ బీజేపీ అధిష్ఠానం ధామివైపే మొగ్గు చూపింది. సోమవారం జరిగిన ఎల్పీ సమావేశం అనంతరం సీఎంగా ఆయన పేరును బీజేపీ ప్రకటించింది. పార్టీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి హాజరయ్యారు. సీఎంగా పుష్కర్ సింగ్ ధామి పేరును ప్రకటించారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ను ఆయన కలిశారు.
కాగా, 46 ఏండ్ల పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు సీఎం అయ్యారు. సొంత నియోజకవర్గం ఖతిమా నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. అయితే ఉత్తరాఖండ్లో కూడా బీజేపీ మరోసారి విజయం సాధించింది. దీంతో పార్టీకి నేతృత్వం వహించి గెలుపు కోసం కృషి చేసిన పుష్కర్ సింగ్ ధామికి సీఎంగా మరో అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు కూడా ఆయనకు బాగా ఉన్నట్లు తెలుస్తున్నది.