డెహ్రాడూన్: ఇవాళ బీజేఎల్పీ నేతగా ఎన్నికైన పుష్కర్సింగ్ ధామి రేపు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ఈ మధ్యాహ్నం డెహ్రాడూన్లోని బీజేపీ హెడ్క్వార్టర్స్లో జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలంతా కలిసి పుష్కర్సింగ్ ధామిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారని తోమర్ వెల్లడించారు. బీజేపీఎల్పీ నాయకుడి ఎన్నిక అనంతరం తాము రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ బేబీ రాణి మౌర్యను కలిశామని చెప్పారు.
పార్టీ నిర్ణయం గురించి గవర్నర్కు తెలియజేసి, నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి వారికి వినతిపత్రం అందజేశామని చెప్పారు. రేపు ఉత్తరాఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ధామి ప్రమాణం చేయబోతున్నారని తోమర్ తెలియజేశారు. అనంతరం పుష్కర్సింగ్ తోమర్ మాట్లాడుతూ.. పార్టీ తననెప్పుడూ తల్లిలా తన రెక్కల కింద దాచుకున్నదని చెప్పారు. పార్టీ ఇంతగొప్ప అవకాశం ఇవ్వడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. క్యాబినెట్లో మార్పుల గురించి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.