Afsana Khan | పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో పంజాబీ గాయని అఫ్సానా ఖాన్ను కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రశ్నించింది. దాదాపు 5 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. లారెన్స్ గ్యాంగ్తోపాటు హత్యలో పాల్గొన్న ఇతర నిందితులు అఫ్సానా ఖాన్కు హత్యతో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీసింది. ఇటీవల ఎన్ఐఏ దాడుల సందర్భంగా అఫ్సానా ఖాన్కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి రావడంతో ఆమెను విచారించేందుకు ఎన్ఐఏ సమన్లు జారీ చేసింది.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యను విచారిస్తున్న ఎన్ఐఏ.. మరో గాయని అఫ్సానా ఖాన్ను బుధవారం దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించింది. లారెన్స్ గ్యాంగ్తో పాటు మూసేవాలా హత్యలో పాల్గొన్న ఇతర నిందితులు.. బంబిహా గ్యాంగ్తో అఫ్సానా ఖాన్ సన్నిహితంగా ఉన్నట్లు వెల్లడించారు. దీంతో అఫ్సానాను విచారణకు పిలిచి ముసేవాలా హత్య, అందులోని గ్యాంగ్స్టర్, ఉగ్రవాద సంబంధాలపై విచారిస్తున్నది. గ్యాంగ్స్టర్ల మధ్య విబేధాల కారణంగానే మూసేవాలా హత్యకు గురైనట్లు ఇప్పటివరకు పోలీసుల విచారణలో తేలింది. ఈ పరిస్థితిలో బంబిహా గ్యాంగ్ గురించి లోతుగా తెలుసుకునేందుకు ఎన్ఐఏ అఫ్సానా ఖాన్ను విచారించినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు.
అఫ్సానా ఖాన్ను సోదిరగా భావించే సింగర్ మూసేవాలా.. ప్రతి ఏటా ఆమెతో రాఖీ కట్టించుకునేవాడని, ఆమె కూడా ఆయనతో కలిసి పాటలు పాడేందుకు ఉత్సాహం చూపేదని స్థానికులు చెప్తున్నారు. మూసేవాలతో కలిసి అఫ్సానా పాడిన పాట సెప్టెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉండగా, కోర్టు ఆదేశాల మేరకు మ్యుజీషియన్ సలీమ్ మర్చంట్ పాట విడుదలను నిలిపివేశారు.