చండీగఢ్: పంజాబ్ గవర్నర్, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ తన పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
వ్యక్తిగత కారణాలతోపాటు, ఇతర పనులు ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఆయన శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు.