చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ సర్కార్ 26,454 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 25 శాఖలకు చెందిన ఖాళీలను ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఖాళీల ప్రకటన జారీ చేసిన రెండు రోజుల్లోనే దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంజాబ్ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వెబ్సైట్లో ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. వివిధ రకాల ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రభుత్వం వెల్లడించింది. పోలీసు శాఖలో అత్యధికం 10,314 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆతర్వాత విద్యాశాఖలో 6,452, ఆరోగ్యశాఖలో 2188 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.