లూథియానా: సీనియర్ నాయకుడు, శిరోమణి అకాలీదళ్ పార్టీ కురువృద్ధుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్సింగ్ బాదల్ (94)కు ఒమిక్రాన్ సోకింది. గత వారం ఆయనకు స్వల్పంగా జ్వరం రావడంతో కుటుంబసభ్యులు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఆ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్గా తేలింది. దాంతో చికిత్స నిమిత్తం ఆయనను దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలో చేర్పించారు.
వైద్యులు ఆయన శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పటియాలాలోని ల్యాబ్ పంపించగా దానికి సంబంధించిన ఫలితాలు ఇవాళ వెల్లడయ్యాయి. ప్రకాశ్సింగ్ బాదల్కు సోకింది ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్గా తేలింది. అయితే, ప్రస్తుతం బాదల్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యుల బృందం ఇన్చార్జి డాక్టర్ రాజేష్ మహాజన్ తెలిపారు.
ప్రకాశ్సింగ్ బాదల్ ప్రస్తుతం గొంతు గరగర, కొద్దిగా దగ్గు, స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారని మహాజన్ చెప్పారు. ఈ చిన్నపాటి సమస్యలు తప్ప ప్రస్తుతం బాదల్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఆయన వెల్లడించారు.