Punjab Bandh | న్యూఢిల్లీ: రైతు డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు సంఘాలు సోమవారం పంజాబ్ బంద్కు పిలుపునిచ్చాయి. పాలు, పండ్లు, కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు రోడ్డు, రైలు మార్గాలను పూర్తిగా దిగ్బంధించి పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించడానికి రైతు సంఘాలు సన్నద్ధమవుతున్నాయి.
ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించే ఈ బంద్కు పలు వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి. అంబులెన్స్, వివాహ వాహనాలు తప్ప మిగతావేవీ సోమవారం రోడ్లపై అనుమతించమని బంద్కు నేతృత్వం వహిస్తున్న రైతు సంఘాలు ప్రకటించాయి.