చండీగఢ్: డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. 2015లో ఎన్డీపీఎస్ చట్టం కింద సుఖ్పాల్పై కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయ డ్రగ్ ముఠాకు సాయం చేయడంతోపాటు, వారికి ఆశ్రయం కల్పించినట్టు ఆయనపై చార్జిషీట్లో పేర్కొన్నారు.
ఆప్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆగ్రహం
ఖైరా అరెస్టు ప్రతిపక్ష ఇండియా కూ టమిలో చిచ్చు రేపింది. ఆప్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. అయితే చట్టప్రకారమే ఖైరాను అరెస్ట్ చేసినట్లు ఆప్ వెల్లడించింది.