చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి ( Punjab CM ) చరణ్జీత్ సింగ్ చన్నీఇవాళ శ్రీ చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ ముఖ్య అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన చన్నీ.. అక్కడి అధికారికి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, చన్నీ ఈ ఎన్నికల్లో శ్రీ చామ్కౌర్ సాహిబ్తోపాటు మరో అసెంబ్లీ నియోజకవర్గం భదౌర్ నుంచి కూడా బరిలో దిగుతున్నారు.
భదౌర్లో సోమవారమే నామినేషన్ దాఖలు చేసిన చన్నీ ఇవాళ చామ్కౌర్ సాహిబ్లో కూడా నామినేషన్ వేశారు. కాగా, పంజాబ్లో ఈ నెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఆమ్ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. ఇక శిరోమణి అకాలీదల్ పార్టీ బీఎస్పీతో, అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జట్టుకట్టాయి.