Kejriwal-ED | మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల తనిఖీలను పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ గురువారం ఖండించారు. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికే ఆయన ఇంటిలో తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు.
మరోవైపు, కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున అరెస్ట్ చేయకుండా నివారించలేమని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆప్ నేతలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీ లాండరింగ్ చట్టంలోని 50 సెక్షన్ ప్రకారం కేజ్రీవాల్ ను విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.