లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళనలో మరణించిన నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ కుటుంబానికి ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘెల్, పంజాబ్ సీఎం చరంజిత్ సింగ్ చన్నీ తెలిపారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో లక్నో ఎయిర్పోర్టుకు చేరుకున్న వీరు ఈ మేరకు ప్రకటించారు. హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు.