మహారాష్ట్రలో కొద్దిరోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగుల్లో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకుంది. దీంతో అవి పొంగిపొర్లుతున్నాయి. కాగా, మహారాష్ట్రలోని పుణేలో ఇద్దరు పోలీసులు నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి వీరోచిత చర్య కెమెరాకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, పార్లమెంటు సభ్యురాలు సుప్రియా సూలే ట్విటర్లో షేర్ చేశారు. దత్తవాడి, ఫుణే పోలీస్ కానిస్టేబుల్ సద్దాం షేక్, అజిత్ పోకరే.. శివనేలోని బగుల్ ఉద్యాన్ సమీపంలో ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వీరిద్దరూ చూపిన ధైర్యం అభినందనీయం! మహారాష్ట్ర పోలీసుల పట్ల మేము గర్విస్తున్నాం!’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.
Dattawadi,Pune Police Constable Saddam Shaikh and Ajit Pokare rescued a man who was being swept away in a stream near Bagul Udyan in Shivane.Risking their own lives,the courage shown by the two is commendable!We are proud of the Maharashtra Police! @PuneCityPolice @DGPMaharashtra https://t.co/4iLWbOppDr
— Supriya Sule (@supriya_sule) July 9, 2022