పునేలోని ఒక బంగారు నగల దుకాణంలో బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు బంగారు నగల్నిచోరీ చేశారు. పునేలోని చందానగర్లో ఉన్న నహర్ అనే బంగారు నగల దుకాణంలోకి ప్రవేశించిన వీళ్లు బంగారు చెవి కమ్మలు దొంగతనం చేశారు. ఆ చెవి కమ్మల విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని షాపు యజమాని యశ్ నహర్ చెప్పాడు. అయితే, అక్టోబర్ 26వ తేదీనే ఈ దొంగతనం జరిగింది. కానీ, ఈ విషయాన్నిదుకాణంలోని ఉద్యోగులు ఎవరూ గుర్తించలేదు. రెండు రోజుల క్రితం కంప్యూటర్లో నగల జాబితాని చెక్ చేస్తుండగా బంగారు కమ్మలు కనిపించలేదు. దాంతో అనుమానం వచ్చిన షాపు యజమాని సీసీ టీవీ పుటేజీ చెక్ చేశాడు.
అక్టోబర్ 26వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు బుర్ఖా ధరించిన ఇద్దరు మహిళలు వచ్చారు. నగలు చూపించాలని సేల్స్మెన్ని అడిగారు. కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరు మహిళలు హడావిడిగా దుకాణం నుంచి బయటకు వెళ్లడం గమనించాడు. వాళ్లే దొంగతనం చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.