Puducherry | పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్ ఆలయానికి చెందిన 32 ఏళ్ల లక్ష్మి అనే ఏనుగు బుధవారం మధ్యాహ్నం మృతిచెందిన విషయం తెలిసిందే. లక్ష్మిని వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, లక్ష్మి మరణవార్త తెలుసుకున్న అక్కడికి చేరుకొని లక్ష్మికి నివాళులర్పించారు. స్థానిక ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వేలమంది ప్రజలు లక్ష్మికి కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. పలువురు ప్రజలు లక్ష్మి పార్థివదేశం వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
1995లో ఓ వ్యాపారవేత్త లక్ష్మి అనే ఈ ఏనుగును వినాయక ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆలయానికి వచ్చే భక్తులకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎంతో ఆదరణ పొందింది. విదేశీ భక్తులు కూడా లక్ష్మి ఆశీర్వదాలు తీసుకుని సంబరపడిపోయేవారు.