న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి పాకిస్థాన్కు చైనా గత మూడేండ్లుగా రక్షణ సహాయాన్ని అందజేస్తున్నట్టు పీటీఐ వార్తాసంస్థ వెల్లడించింది. అందులో భాగంగా పాకిస్థాన్కు స్టీల్ హెడ్ బంకర్ల నిర్మాణంలో సహకరించడమే కాక, మానవ రహిత ఏరియల్ వాహనాలు, కాంబాట్ ఏరియల్ వెహికల్స్లను చైనా సరఫరా చేస్తున్నదని పేర్కొన్నది.
ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్ఠతకు అత్యంత శక్తివంతమైన కమ్యూనికేషన్ టవర్లు నిర్మాణం, ఎల్వోసీ వెంబడి ఫైబర్ ఆప్టికల్ కేబుల్ లైన్లను కూడా నిర్మిస్తున్నదని తెలిపింది. మధ్య, స్వల్ప ఎత్తులలో లక్ష్యాలను గుర్తించే చైనా రాడర్ వ్యవస్థలో అధునాతన జేవై, హెచ్జీఆర్ సిరీస్ రాడర్ సిస్టమ్లను సైనిక, వాయు దళాలకు సరఫరా చేస్తున్నదని వెల్లడించింది.